Friday, May 3, 2024

Road Accident: రెండు బైక్‎లు ఢీ.. ఇద్దరు మృతి

విశాఖప‌ట్నం జిల్లాలోని ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. కంచరపాలెం వంతెనపై అర్థరాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వ‌చ్చి ఢీకొన్న ప్ర‌మాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అడివి వరంకి చెందిన రామిరెడ్డి, కంచరపాలెం బర్మా క్యాంపుకు చెందిన దినేష్‎గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement