Friday, May 3, 2024

టీయూడబ్ల్యూజే ఢిల్లీ కమిటీ ఎన్నిక ఏక్ర‌గీవం..

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఢిల్లీ కమిటీ అధ్యక్షుడిగా నాగిళ్ల వెంకటేష్(సాక్షి టీవీ), ప్రధాన కార్యదర్శి గా తిరుపతి (వెలుగు), కోశాధికారిగా శిరీష్ రెడ్డి (హెచ్ఎంటీవీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం తెలంగాణ భవన్ లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం జరిగింది. యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్  ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ టీయూడబ్ల్యూజే సభ్యులు యూనియన్ కార్యకలాపాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ సభ్యులు ఐకమత్యం, పరస్పర సహకారంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు. అనంతరం అధ్యక్షుడిగా నాగిల్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి, కోశాధికారిగా శిరీష్ రెడ్డి లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అభినందనలు తెలియజేశారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టుల ను ఆదుకున్న మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు ఢిల్లీ టీయూడబ్ల్యూజే కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement