Sunday, May 5, 2024

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిని దర్శనార్ధం ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్స్ శనివారం ఉదయం 9 గంటలకు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచారు. రోజుకు 25వేల టిక్కెట్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునేలా అధికారులు వీలు కల్పించారు. కాగా వచ్చే నెలకు సంబంధించి తిరుమలతో పాటు.. తిరుపతిలో గల టీటీడీ వసతి గదులను ఈరోజు సాయంత్రం వెబ్‌సైట్‌ ద్వారా విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement