Saturday, May 4, 2024

పుణ్యక్షేత్రాలకు టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. 2500 టికెట్‌తో టూర్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కర్నాటక, మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రాలకు టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈనెల 17న అమావాస్య సందర్భంగా ఆ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గానుగాపూర్‌ దత్తాత్రేయస్వామి ఆలయానికి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీతో సూపర్‌ లగ్జరీ బస్సును టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గానుగాపూర్‌తో పాటు మహారాష్ట్రలోని పండరీపూర్‌, తుల్జాపూర్‌కు సైతం ఈ సర్వీసులను నడుపుతున్నారు.

ప్రత్యేక సర్వీసు ఈనెల 16న సాయంత్రం 6 గంటలకు ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరుతుంది. కాగా, గానుగాపూర్‌ ప్రత్యేక బస్సు టికెట్‌ ధర రూ.2500గా టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరలో ప్రయాణ సదుపాయం మాత్రమే సంస్థ కల్పిస్తోంది. దర్శనం, భోజన వసతి సదుపాయాలు భక్తులదే బాధ్యత. ముందస్తు రిజర్వేషన్‌ వివరాల కోసం ఆర్టీసీ అధికారుల ఫోన్‌ నం.94405 66379, 9959226257లను సంప్రదించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement