Friday, March 15, 2024

గ్రూప్‌-4 దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 3 వరకు పొడిగించిన టీఎస్‌పీఎస్సీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-4 దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) తెలిపింది. సోమవారంతో గ్రూప్‌-4 దరఖాస్తుకు గడువు ముగియనుండగా ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు 8,47,277 దరఖాస్తులు చేసుకున్నారని, సోమవారం ఒకే రోజు 34,247 దరఖాస్తులు అందాయని తెలిపింది.

గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి కమిషన్‌ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. గత డిసెంబర్‌ 30 నుంచి జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించిన గడువు ముగియడంతో మరోసారి గడువును పొడిగించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 8,180 పోస్టులను భర్తీ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement