Sunday, April 28, 2024

TS – చేత‌బ‌డి అనుమానంతో ఇద్ద‌రు దారుణ హ‌త్య ..

గూడూరు: మంత్రాల నెపంతో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెలో చేతబడులు చేస్తున్నారని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిని అందరూ చూస్తుండగానే నడీ రోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో జరిగింది. గూడూరు మండల కేంద్రంలోని బొల్లెపల్లి గ్రామానికి చెందిన తల్లి కొడుకులు ఆలు కుంట్ల సమ్మక్క(50) కొడుకు ఆలుకుంట్ల సమ్మయ్య (35) లను అదే గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి రాడ్డుతో తలపై మోదీ అతి కిరాతకంగా ఇద్దరినీ హత్య చేశారు. తన కుటుంబ సభ్యులపై మంత్రాలు చేస్తున్నారనే కక్షతో కుమారస్వామి కక్షలు పెట్టుకొని ఈ దారుణానికి ఒడగట్టినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. హత్య చేసిన నిందితుడు కుమారస్వామిని పోలీసులు అదుపులో తీసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement