హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) పరీక్షా షెడ్యూల్ను ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. మార్చి 13, 14, 15 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పనిచేసేందుకు అర్హత పరీక్షగా దీన్ని నిర్వహిస్తారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ త్వరలోనే పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని అధికారులు గురువారం ప్రకటించారు.
టీఎస్ సెట్ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గత ఏడాది డిసెంబర్ 30 నుంచి ప్రారంభంకాగా ఈనెల 20తో దరఖాస్తు గడువు మిగిసింది. అయితే అధికారులు దాన్ని ఈనెల 25వ తేదీ వరకు పొడిగించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు టీఎస్ సెట్కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.