Monday, April 29, 2024

TS | నామినేషన్ పత్రాలను ఆన్లైన్లో కూడా అందించివ‌చ్చు : సీఈఓ

ఎన్నిక‌ల‌ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నేటి నుంచే నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఎన్నిక‌ల‌ ప్రచారంలో భాగంగా బిజీ బిజీగా తిరుగుతున్న అభ్యర్థులు నామినేషన్ కోసం మళ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి అవసరం లేకుండా.. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆన్లైన్లో కూడా అందించొచ్చని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వికాస్ రాజ్ కీలక సూచనలు చేశారు.

నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా లెటెస్ట్ ఫోటోలు పెట్టాలని వికాస్ రాజ్ తెలిపారు. లేదంటే నామినేషన్ పత్రాలను రిజెక్ట్ చేస్తామని సూచించారు. నామినేషన్ ఫామ్.. అఫిడవిట్‌లు జాగ్రత్తగా నింపాలని… ఫాం-ఏ, ఫాం-బీపై ఒరిజినల్ సంతకాలు ఉండాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement