Thursday, May 16, 2024

TS | ఎమ్మెల్యేగా గెలిపిస్తే… ప్రజలకు సేవకునిగా ఉంటా : డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు సేవకునిగా పనిచేస్తూ పేదల కష్టాలు తీర్చుతానని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్నికల ప్రచారం చివరి రోజు కాగజ్ నగర్ పట్టణంలో భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. బట్ పల్లి చౌరస్తా నుంచి మొదలైన ర్యాలీ ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగింది.ర్యాలీ ఉద్దేశించి మాట్లాడుతూ సిర్పూర్ ప్రాంతంలో సహజ వనరులను అక్రమంగా దోచుకుంటున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దుష్టపాలన పోవాలంటే బీఎస్పీ గెలవాలన్నారు.ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపిస్తే నాణ్యమైన విద్య,వైద్యం అందిస్తామన్నారు. యువతకు స్వయం ఉపాధి  కల్పించడంతోపాటు ఎస్పీఎం కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బీఎస్పీని ఓడించేందుకు బీఆర్ఎస్, బిజెపి,కాంగ్రెస్ పార్టీలో కుట్రలు చేస్తున్నాయన్నారు.ఈ ప్రాంతంలో దోపిడీ,దౌర్జన్యాలు పోవాలంటే బీఎస్పీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కాగజ్ నగర్ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ ర్యాలీలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్,రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా అధ్యక్షులు లెండుగురే శ్యామ్ రావు,నియోజవర్గం ఇంఛార్జి దుర్గం మోతీరాం, పట్టణ అధ్యక్షులు ముస్తఫీజ్, ఇంచార్జీ షబ్బీర్, కౌన్సిలర్లు మినాజ్,శ్రీలత మహేష్, లావణ్య శరత్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement