హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 28న గురువారం అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. దాదాపుఅయిదున్నర గంటలకు పైగా ఆయన రాష్ట్ర్రంలో పర్యటిస్తారు. కొంగరకలాన్లో జరిగే బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 28న అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఈవిధంగా ఉంది..
28న మధ్యాహ్నం 12.05 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ హోటల్కు వెళ్తారు. నోవాటెల్ హోటల్లో మధ్యాహ్నం 12.20 గంటల నుంచి 1.45 గంటల వరకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. అనంతరం 1.50 గంటలకు కొంగరకలాన్లో జరిగే భాజపా రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం అనంతరం తిరిగి శంషాబాద్ హోటల్కు చేరుకుంటారు. రాష్ట్ర పర్యటనను ముగించుకుని సాయంత్రం 5.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లి బయల్దేరి వెళతారు.