Saturday, May 4, 2024

TS: కాంగ్రెస్ సర్కార్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు…

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానంతట అదే పడిపోతే మాత్రం మేం ఏమీ చేయలేమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీల‌క‌ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలిపోతుందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు సైతం ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్‌ను టచ్ చేస్తే మాడి మసైపోతారని సీఎం రేవంత్ రెడ్డిగా ఘాటుగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ల‌క్ష్మ‌ణ్ మరోసారి కాంగ్రెస్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారమని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓ పక్క బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టదని చెబుతూనే.. అదే పడిపోతే మేం ఏం చేయలేమనడం వెనుక అర్థం ఏంటని ప‌లువురు చర్చించుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement