Tuesday, April 30, 2024

TS : కంటోన్మెంట్​, చేవేళ్లలో సీఎం రేవంత్​ పర్యటన

ఇవాళ చేవెళ్ల లోక్‌సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం గాంధీభవన్ లో బీజేపీపై ఛార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

సాయంత్రం రాజేంద్ర నగర్ ( చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం)లో రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రోడ్ షో లో సీఎం పాల్గొననున్నారు.చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ర్యాలీతో పాటు సభలోనూ సీఎం రేవంత్ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement