Monday, May 20, 2024

TS : ఇవాళ ప్ర‌ధాని మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారం

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. నేటి మధ్యాహ్నం అల్లాదుర్గ్‌లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్-మెదక్ జనసభలోనూ ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు.

- Advertisement -

ప్రధాని మోడీ సాయంత్రం హెలికాప్టర్ ద్వారా జహీరాబాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబాద్-మెదక్ జనసభ ప్రాంగణానికి చేరుకుంటారు. అనంత‌రం పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. సభ అనంతరం జహీరాబాద్ నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయమవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement