Sunday, April 28, 2024

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్‌ఎస్ ఎంపీల ఓటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విపక్షాలు బలపరిచిన ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్‌ఎస్ ఎంపీలు ఓటు వేశారు. ఆ పార్టీ రాజ్యసభ, లోక్‌సభ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విపక్షాల అభ్యర్ధి మార్గరెట్ అల్వాకు ఓటు వేసి మద్దతు తెలిపామని ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు చెప్పారు.. రాజ్యసభకు ఎన్నికైన కొద్దిరోజుల్లోనే తనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం రావడంపై టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement