Wednesday, May 15, 2024

TS | నలుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ !

తెలంగాణ రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావును డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. రామగుండం డీసీపీగా పనిచేస్తున్న కేకన్‌ సుధీర్‌ రామ్‌నాథ్‌ మహబూబాబాద్‌ ఎస్పీగా నియమితులయ్యారు. గవర్నర్‌ ఏడీసీగా పనిచేస్తున్న ఆకాంక్ష యాదవ్ సెంట్రల్ జోన్ డీసీపీగా, భూపాలపల్లి ఓఎస్డీగా పనిచేస్తున్న అశోక్ కుమార్ రామగుండం డీసీపీగా బదిలీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement