Friday, April 26, 2024

Breaking | వరంగల్ కమిషనరేట్లో 12 మంది ఎస్సైల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీపీ రంగనాథ్

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పని చేస్తున్న 12 మంది సబ్ ఇన్స్ పెక్టర్ల ను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. వేకెన్సీ రిజర్వులో ఉన్న ఎస్సైలకు పోస్టింగ్స్ లో ప్రాధాన్యతనిచ్చారు. అనేక కారణాలతో విఆర్ లో ఉన్న ఎస్సైలపై పోలీస్ కమిషనర్ కనికరం చూపారు. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బదిలీలపై పోలీస్ బాస్ ఫోకస్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

వరంగల్ పోలీస్ కమిషనరేట్లో వేకన్సీ రిజర్వులో ఉన్న ఎం. సురేష్ హసన్ పర్తి ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు. వీఆర్ లో ఉన్న మరో ఎస్సై భూక్యా చందర్ కేయూసీ ఎస్సైగా , వీఆర్లోనే ఉన్న మరో ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్ ను వర్ధన్నపేటకు, వర్ధన్నపేట ఎస్సైగా ఉన్న బి. రామారావును హనుమకొండకు బదిలీ చేశారు.

- Advertisement -

వీఆర్ లో ఉన్న డి.వి ఫణిని సుబేధారి ఎస్సైగా, హన్మకొండ ఎస్సై డి.రాజు ను వరంగల్ టాస్క్ ఫోర్స్ కు, భద్రాది కొత్తగూడెం నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో రిపోర్ట్ చేసిన జి. అరుణ్ ను జనగామ ఎస్సైగా నియమించారు. వీఆర్ లో ఉన్న బి.మాధవ్ ను మట్వాడ ఎస్సైగా, వేకన్సీ రిజర్వు లో ఉన్న ఎండీ గాలిబ్ సుబేధారి ఎస్సైగా, వీఆర్ లో ఉన్న గాలిబ్ షరీఫ్ ఇంతేజార్ గంజ్ ఎస్సైగా, వీఆర్ లో ఉన్న ఎండీ వలి హసన్ పర్తికి, కె.లక్ష్మిని భరోసా సెంటర్ కు, వరంగల్ ట్రాఫిక్ నుండి పలు ఆరోపణలపై వీఆర్ కు పోయిన ఎస్. డేవిడ్ ను కొడకండ్ల ఎస్సైగా బదిలీ చేస్తూ వరంగల్ సీపీ రంగనాథ్ ఉత్తర్వులను జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement