ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పట్టణానికి చెందిన పాటిబండ్ల మృదుల.. ప్రజ్ఞాన్, మహాన్ అనే తన ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా ఉన్న తామరచెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో చెరువులో ఉన్న మృతదేహాలను ఈతగాళ్ల సహాయంతో పోలీసులు బయటకు తీసారు. అయితే కుటుంబ కలహాల నేపాథ్యంలోనే ఈఘటన జరిగినట్లు సమాచారం. మృతురాలు, ఆమె భర్త అమెరికాలో సాఫ్ట్ వేర్లుగా పనిచేసి ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్ కు వచ్చారు. ఇందుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement