Monday, April 29, 2024

హొలీ పండగలో విషాదం…కాగ్న చెక్ డ్యాం వద్ద నీట‌ మునిగి యువకుడి మృతి

హోలీ పండుగ సంబరాలు తాండూర్ లో విషాదం నింపాయి. హోలీ ముగిసిన అనంతరం స్నానం కోసం వెళ్ళిన యువకుడు నీట మునిగి చ‌నిపోయాడు. తాండూర్ మున్సిపల్ పరిధి మల్రెడ్డిపల్లికి చెందిన ప్రదీప్ కుమార్ హోలీ ఆడిన తర్వాత తన స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు పాత తాండూర్ పరిధిలో ఉన్న కాగ్నా నది చెక్ డ్యాం వద్దకు వెళ్లాడు. ఈత కొడుతూ ప్రదీప్ నీటిలో మునిగి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరోవైపు స్నేహితులు ప్రదీప్ బతికించాలని చేసిన ప్రయత్నం ఫ‌లించ‌లేదు. ఆస్పత్రికి తరలించగా డాక్ట‌ర్లు పరిశీలించి చ‌నిపోయిన‌ట్టు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement