Tuesday, April 30, 2024

‘కంది’ పోతున్న రైతు….

హైదరాబాద్‌, : కందుల కొనుగోళ్లకు సంబం ధించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడం తో..వివిధ ప్రాంతాల్లో వేరు వేరు ధర పలుకుతోంది. ధరల్లో వ్యత్యాసంతో పాటు తూకంలో ప్రైవేటు వ్యాపారులు కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటు న్నారు. కంది కొనుగోళ్లకు సంబంధించి ఫిబ్రవరి రెండో వారం ముగిసినప్పటికీ..కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా ఏర్పాటుకాలేదు. వాస్తవానికి జనవరిలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పిన మార్క్‌ఫెడ్‌ శాఖ, ఆ తరువాత ఫిబ్రవరి మొదటివారంలో కొనుగోళ్లు జరుపు తామని చెప్పింది. అయితే ప్రస్తుతం ఫిబ్రవరి రెండో వారం ముగిసినప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోగా, అసలు వాటి ఏర్పాట్లు కూడా చేయకపోవడం గమనార్హం. గత సీజన్‌తో పోల్చుకుంటే ఈ సారి సీజన్‌లో కంది పంట విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా స్టేట్‌ పూల్‌లో కొనుగోలు జరిపేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కంది కొనుగోళ్లకు సంబంధించి నాఫెడ్‌ తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుండడంతో..పర్యటనపై బొంబా యి కి వెళ్లిన శాఖ ఛైర్మన్‌..నాఫెడ్‌ ప్రతినిధులతో చర్చించిన నేపథ్యంలో సుమారు 2లక్షల టన్నుల వరకు కందుల కొనుగోళ్లకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
కందులు మార్కెట్‌కు వస్తున్నప్పటికీ కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించని అంశంపై ఓ అధికారిని సంప్రదించగా ప్రభుత్వ ధర కంటే ప్రైవేటు వ్యాపారులే ఎక్కువగా ధర ఇసు ్తన్నారని తెలిపారు. అయితే అన్నిచోట్ల ఇదే పరిస్థితి లేకపోవ డం గమనార్హం. రాష్ట్రంలో కంది పంట పండుతున్నప్పటికీ ధర విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం బయట మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు రూ.6వేలకు పైగా కొనుగోలు జరుపు తు న్నారని చెబు తు న్నా..తూకంలో కొర్రీలు పెడుతున్నట్టు తెలుస్తోంది. కంది రకాలను బట్టి కూడా ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నా యి. కొలంబో, మన కందులకు వేరు, వేరు ధరలు పలుకుతున్నాయి.
ఒకవైపు సీఎం స్టేట్‌ పూల్‌లో కొనేందుకు అనుమతి, మరోవైపు నాఫెడ్‌ కూడా కొనుగోళ్లకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ మార్క్‌ఫెడ్‌ శాఖ కంది కొనుగోళ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 11లక్షల ఎకరాల్లో కంది పంట సాగవగా..దీనికి సంబంధించి సుమారు 7లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే అంచనాలు వేసి, ఏర్పాట్లు చేస్తున్నామని మాటల్లో చెప్పినంత హాడావిడి చేతల్లో లేదని శాఖ వ్యవహారంతో తెలుస్తోంది. ఈ సారి క్వింటాల్‌కు రూ.6వేలు ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు కూడా సంతోషించి నప్ప టికీ, ఇంకా కేంద్రాలు ఏర్పాటు చేయక పోవ డంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరిలో నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ మార్కెట్లకు వచ్చిన కందుల ధరలను పరిశీలిస్తే.. ఖమ్మంలో 17న 6,400 ధర రాగా, ఈ ధర అంద రికి రావడంలేదని రైతులు చెబుతు న్నారు. ఇదిలా ఉంటే నిజామాబాద్‌లో 12వ తేదీన రూ.6,366 ధర పలకగా, 16న రూ.5,701, 17వ తేదీన రూ.5,609గా ధర ఉంది. పెరగాల్సిన ధర తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్‌ మార్కెట్‌లో 17న రూ.6,362 ధర పలకగా ఇక్కడ కనిష్ఠ ధర రూ.4,902గా ఉంది. మూడు మార్కెట్లలో ఇంత వ్యత్యాసాలు ఉండగా, క్షేత్రస్థాయిలో పంటను విక్రయించు కునే సమయంలో తూకం, నాణ్యతా కొర్రీలు కూడా ప్రధాన సమస్యగా ఉన్నాయని రైతులు తెలుపుతున్నారు.
ప్రస్తుతం శాఖ వ్యవహారం చూస్తుంటే వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా ఉందంటూ ఆరోపిస్తున్నారు రైతులు. ఇప్పటికే పంటచేతికి వచ్చి మార్కెట్‌ వెళ్తున్న రైతులకు సరైన ధర రాకపోగా, నాణ్యతా ప్రమాణాలతో ధరలో ప్రైవేటు వ్యాపారులు మరికొంత కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. గతంలో లాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోళ్లు చేపడుతామని చెప్పిన శాఖ ఇంకా వీటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో నష్టపోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement