Saturday, April 20, 2024

‘దియా మీర్జా’ పెళ్లి చేసింది పురోహితురాలు

బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా పెళ్లిలో పురోహితురాలు మంత్రాలు చదివారు.  హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఆమె పెళ్లిలో ఓ మహిళా పురోహితురాలు మంత్రాలు చదివిందట. దీని గురించి ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేసిన దియా.. తన పెళ్లి చేసిన పురోహితురాలికి ధన్యవాదాలు తెలిపింది.‘‘మా పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ షీలీ అత్త. మనిద్దరం కలిసి ఇలా ఎదుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసింది. దీనికి #GenerationEquality అనే ట్యాగ్ తగిలించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement