Monday, April 29, 2024

రేపే టీ20 ఫైన‌ల్ మ్యాచ్‌.. పాకిస్తాన్‌, ఇంగ్లండ్ బిగ్ ఫైట్‌కు వ‌ర్షం అడ్డంకి!

ICC మెన్స్ T20 ప్రపంచ కప్ 2022 ఫైనల్ పోటీ రేపు జ‌ర‌గ‌నుంది. ఈ పోటీ పాకిస్థాన్, ఇంగ్లాండ్ జ‌ట్లు మధ్య ఉండ‌నుంది. మధ్యాహ్నం 1 గంటలకు జరగాల్సిన గేమ్ టాస్ ఇప్పుడు మార్చారు. కొత్త టైమ్‌టేబుల్ ప్రకారం టాస్ మధ్యాహ్నం 12.52 నిమిషాల‌కే జరుగుతుంది. ఇంగ్లండ్‌తో తలపడే మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకు బాబర్ అజామ్ కెప్టెన్‌గా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCC)లో బిగ్ ఫైట్ జ‌ర‌గ‌నుంది.

ఫైనల్స్‌పై వర్షం ఎఫెక్ట్‌..

- Advertisement -

ఇరు జట్ల సిబ్బంది వాతావరణ ప‌రిస్థితుల‌ను నిశితంగా గమనిస్తున్నారు. వాతావరణంలో చాలా మార్పులొచ్చాయి. మ‌బ్బులుప‌ట్టిన ఆకాశం.. ఎప్పుడు కుండ‌పోత వాన ప‌డుతుందో తెలియ‌న‌ సూచనలు క‌నిపిస్తున్నాయి. ఇది ఫైన‌ల్ మ్యాచ్‌కి ఆటంకంగా మార‌వ‌చ్చు. వాతావరణ సూచన ప్రకారం.. మ్యాచ్ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతంలో కొనసాగుతున్న లానినా ప్రభావంతో భారీ వర్షాలు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.. అయితే వ‌ర్షం కురిస్తే క‌నుక సోమ‌వారం నాడు మ్యాచ్ ఉంటుంద‌ని స్పోర్ట్స్ అన‌లిస్టులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement