Wednesday, May 1, 2024

నటుడు పొట్టి వీరయ్య మృతి..

టాలీవుడ్‌ నటుడు పొట్టి వీరయ్య ఇకలేరు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ లో మృతి చెందాడు. విఠలాచార్య, అగ్గిపిడుగు సినిమాలతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఆయన తెలుగు, తమిళ, కన్నడ చిత్రసీమలో 550 కి పైగా చిత్రాల్లో నటించారు. అగ్గివీరుడు సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. రాధమ్మ పెళ్లి, తాతా మనవడు, టార్జాన్ సుందరి, జగన్మోహిని, పేదరాసి పెద్దమ్మ కథ, కృష్ణ గారడీ, యుగంధర్, గజదొంగ, గోల నాగమ్మ, అత్తగారి పెత్తనం వంటి పలు చిత్రాల్లో పొట్టివీరయ్య వివిధ రకాల పాత్రల్లో నటించారు.

ఇక ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ సారి వీరయ్య అనారోగ్య పరిస్థితి బాగా లేని సమయంలో చిరంజీవి రెండు లక్షల ఆర్థిక సాయాన్ని చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున చిరంజీవి చేసిన ఆర్థిక సాయాన్ని తలుచుకుని ఆనాడు పొట్టి వీరయ్య ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement