Monday, April 29, 2024

Tokyo Olympics: జావెలిన్ త్రో ఫైనల్స్‌కు నీరజ్‌ చోప్రా..

టోక్యో ఒలింపిక్స్‌లో నేడు భారత ప్రస్థానం విజయంతో ప్రారంభమైంది. పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్​-ఏలో నీరజ్‌ చోప్రా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్‌కు చేరాడు. తొలి ప్రయత్నంలోనే అతను రికార్డు స్థాయిలో 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసిరాడు. గ్రూప్-ఏ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి.. నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాడు.

ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జర్మనీకి చెందిన జె.వెట్టర్ (85.64 మీ), ఫిన్లాండ్‌కు చెందిన ఎల్.ఎటెలాటలో (84.50 మీ) నిలిచారు. ఈ నెల 7న జావెలిన్ త్రో ఫైనల్ జరగుతుంది.మరోవైపు గ్రూప్-బిలో ఇదే అంశంపై జరుగుతున్న క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత్‌కు చెందిన శివపాల్ సింగ్ కూడా తలపడుతున్నాడు. ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ఉదయం 11 గంటలకు బుసానజ్‌తో సెమీఫైనల్‌లో తలపడుతుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు భారత్-అర్జెంటీనా మధ్య మహిళల హాకీ సెమీస్ జరగనుంది.

ఇది కూడా చదవండి: ఆ దేశంలో కరోనా ఫోర్త్ వేవ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement