Thursday, April 25, 2024

Tokyo Olympics: కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు..

నాలుగు దశాబ్దాల భారత హాకీ జట్టు కల నెరవేరింది. ఎట్టకేలకు టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించింది పురుషుల హాకీ జట్టు. జర్మనీతో జరిగిన పోరులో తిరుగులేని విజయం సాధించింది. అఖండ భారతావనిని మురిపించింది. టోక్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. పతకాల కరవు తీరుస్తూ హాకీ ఇండియా అద్భుతం చేసింది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది.

తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరికి భారత జట్టు విజయం సాధించింది. మ్యాచ్ చివరి క్వార్టర్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. జర్మనీ నాలుగు గోల్స్ సాధించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే, భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో జర్మనీకి మరో గోల్ దక్కకుండా జాగ్రత్తగా పడ్డారు. టోక్యోలో భారత జట్టు విజయం సాధించిన వెంటనే దేశంలో సంబరాలు మిన్నంటాయి. చారిత్రక విజయాన్ని అందించిన మన్‌ప్రీత్ సింగ్ సేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు, ఓడిన జర్మనీ ఆటగాళ్లు మైదానంలోనే కుప్పకూలి విలపించగా, ఆనందంతో భారత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టారు.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement