Sunday, April 28, 2024

పాండిచ్చేరి ముఖ్యమంత్రికి.. బాహుబలి కాజా సత్కారం

పుదుచ్చేరి ముఖ్య మంత్రి ఎన్.రంగస్వామి ఈరోజు సురుచి బాహుబలి కాజా సత్కారాన్ని అందుకున్నారు. జిల్లాలోని యానాంలో పుదుచ్చేరి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 19వ యానాం ప్రజా ఉత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిని సురుచి పీఆర్వో వర్మ కలిసి, దుశ్శాలువతో సత్కరించి, బాహుబలి  కాజాను అందజేశారు. అంత పొడవైన స్వీటును చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. వర్మ తాపేశ్వరం కాజా విశిష్టతను వివరించారు. వర్మ ఆయనకు సురుచి ఆంధ్రా పిండివంటలను, ఇతర ప్రత్యేక వంటకాలను కూడా బహూకరించారు.

- Advertisement -

జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి బాహుబలి కాజాను బహూకరించి, సత్కరించే సురుచి సాంప్రదాయం ప్రకారం ఈరోజు సాయంత్రం యానాంలో యానాం మాజీ ఎమ్మెల్యే సరే మల్లాడి కృష్ణారావు గృహంలో ఆయనను కలవడానికి వెళ్లిన వర్మ వేలాది కార్యకర్తలను, ప్రజలను దాటి, మల్లాడి కృష్ణారావు అనుమతితో ముఖ్యమంత్రి రక్షణ వలయాన్ని దాటి లోపలికి ప్రవేశించి ఆయనకు బాహుబలి కాజాను అందజేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement