Saturday, May 18, 2024

Guwahati Masters | అశ్విని జోడీకే గౌహతి మాస్టర్స్ టైటిల్‌.. ఫైనల్‌లో చైనీస్‌ తైపీపై విజయం

భారత స్టార్‌ మహిళా డబుల్స్‌ జోడీ అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జోడీ గువహటి మాస్టర్స్‌ సూపర్‌ 100 టైటిల్‌ కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్‌లో రెండో సీడ్‌ అశ్విని-తనీషా ద్వయం 21–13, 21–19 తేడాతో చైనీస్‌ తైపీకి చెందిన సుంగ్‌ షౌ యున్‌-యు చీన్‌ హుయిలను వరుస గేముల్లో చిత్తు చేసి విజేతగా అవతరించారు. ఈ మ్యాచ్‌ను భారత జంట 40 నిమిషాల్లోనే ముగించేసింది.

ఇక ఈ తుది పోరులో ఆదినుంచే చెలరేగి ఆడిన భారత షట్లర్లు తైపీ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. తొలి గేమ్‌ను భారీ తేడాతో గెలుచుకున్న వీరికి రెండో గేమ్‌లో మాత్రం సుంగ్‌ షౌ జోడీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ చివరి వరకు ఏకగ్రతతో ఆడిన అశ్విని జంట ఈ గేమ్‌ను స్వల్ప తేడాతో నెగ్గి మరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

- Advertisement -

పొన్నప్ప-తనీషా జోడీకి ఇది మూడో మేజర్‌ టైటిల్‌ కావడం విశేషం. ఇక సూపర్‌ 100 ఈవెంట్‌లో అబుదాబి మాస్టర్స్‌తో పాటు ఇప్పుడు తాజాగా గువాహటి టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవల లక్నో వేదికగా జరిగిన సయ్యద్‌ మోడీ ఇంటర్నేషన్‌ టోర్నీలో పొన్నప్ప-తనీషా జోడీ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement