Friday, May 3, 2024

తిరుపతి ఉప ఎన్నిక కేసు 30కి వాయిదా!!

తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై విచారణ జరిగింది. ఫలితాలు ప్రకటించకుండా నిలువరించాలని భాజపా అభ్యర్థి రత్నప్రభ తరఫు న్యాయవాది హై కోర్ట్ ను కోరారు. అలాగే వేలమంది దొంగ ఓట్లు వేసినట్లు తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫు న్యాయవాది కూడా తెలిపారు. ఈ నేపధ్యంలోనే ఉపఎన్నిక రద్దు చేసి రీపోలింగ్‌కు ఆదేశించాలని వారు హైకోర్టు ను కోరారు. ఈ వాదనలు విన్న హైకోర్టు..తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement