Friday, April 26, 2024

తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ

ముకేశ్​ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. తనకు కాబోయే భార్యతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్న అనంత్, రాధికాకు ఆలయ రంగనాయకుల మండపం వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముందు తిరుమల దర్శనానికి వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement