Monday, April 29, 2024

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలుపెట్టారు లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. నాగాలాండ్‌, మేఘాలయల్లో ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ సీటు ఏకగ్రీవమయ్యాయి. నాగాలాండ్‌లో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా..4 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. బుధవారం ఈ స్టేషన్లలో రీపోలింగ్‌ జరిగింది. నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించిన 59 సీట్లకు 183 మంది పోటీ పడ్డారు. మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్‌ జరిగింది. ఎన్నికల్లో 259 మంది పోటీ పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement