Sunday, May 5, 2024

ఫిలడల్ఫియాలో కాల్పులు, ముగ్గురి మృతి.. వీకెండ్‌ ఎంజాయ్‌ చేస్తున్న వందలాది మందిపై కాల్పులు

ఫిలడల్ఫియా: అమెరికాలో మరోసారి కాల్పుల దుర్ఘటన చోటు చేసుకుంది. ఫిలడల్ఫియాలోని పాపులర్‌ నైట్‌లైఫ్‌ ఏరియా సౌత్‌ స్ట్రీట్‌ 200 బ్లాక్‌లో వీకెండ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న వందలాది మందిపై శనివారం రాత్రి కొంతమంది దుండుగులు కాల్పులకు పాల్పడ్డారు. ఆ కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారని ఫిలడల్ఫియా పోలీస్‌ డిపార్టమెంట్‌ వెల్లడించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది.మరణించినవారిలో మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారని ప్రకటించింది. దుండుగుల కాల్పుల్లో మరణించిన, గాయపడిన వారి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

సంఘటనాస్థలం నుంచి పోలీసులు ఆటోమేటిక్‌, సెమీ ఆటోమేటిక్‌ తుపాకులను స్వాధీనం చేసుకున్నారని, నిందితులను ఇంకా గుర్తించలేదని తెలిపారు. ఇటీవల అమెరికాలో వరుసగా జరుగుతున్న కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈనెల ఒకటో తేదీన ఓక్లాహామాలో చర్చి బైట జరగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement