Friday, May 3, 2024

పిడుగుపాటుతో ముగ్గురు మృతి.. భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఘ‌ట‌న‌

భూపాలపల్లి (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పిడుగు పడటంతో వేర్వేరు చోట్ల లో ముగ్గురు రైతులు మృతి చెందారు. చిట్యాల మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి వనమ్మ(56),

రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో వంగ రవి(48) అనే రైతు పంట చేన్లలో పని చేస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురయ్యారు. అదేవిధంగా మల్హర్ మండలంలోని ఛత్రాజ్ పల్లి లో కాటం రఘుపతి రెడ్డి (25) పొలంలో వరి నాటు వేస్తున్న క్రమంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. వారితో ఆయా గ్రామాల విషాదఛాయలు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement