Saturday, April 20, 2024

టైగర్‌ని తన 528వ చిత్రంగా ప్రకటించడం ఆనందంగా ఉంది.. అనుపమ్ ఖేర్

మాస్ మహారాజా రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా ఉగాది కానుకగా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా కోసం రవితేజ కొత్త అవతారంలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం జాతీయ అవార్డ్ గ్రహీత, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ను ఎంపిక చేశారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా చేయడంపై అనుపమ్ ఖేర్ కూ యాప్ ద్వారా స్పందిస్తూ…. తన 528వ చిత్రంగా టైగర్ నాగేశ్వరరావు ను ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement