Friday, May 3, 2024

సిబ్బంది నిర్లక్ష్యం: ఒకేసారి మూడు డోసుల వ్యాక్సిన్..

మహారాష్ట్రలోని ఓ మహిళకు ఏకంగా మూడు డోసుల వ్యాక్సిన్‌ వేశారట. అది కూడా కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే. ఠాణె ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మహిళకు స్థానిక టీకా కేంద్రానికి వ్యాక్సిన్ కోసం భర్తతో కలిసి వెళ్లింది. నర్సు తనకు మూడు సార్లు వ్యాక్సిన్ వేసిందని బయటకు వచ్చాక ఆమె భర్తతో చెప్పింది. దీంతో వ్యాక్సినేషన్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి కావడంతో ఈ విషయాన్ని కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. తన భార్యకు వ్యాక్సినేషన్ గురించి అవగాహన లేదని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని చెప్పాడు. 

కాగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఠాణె మేయర్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆమె భుజంపై మూడు సూదులు గుచ్చినట్టు గుర్తులు ఉండడంతో ఆమె నిజమే చెబుతోందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఇది కూడా చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ కోసం వెళితే రాబిస్ టీకా వేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement