Monday, April 29, 2024

ఇదేందయ్య ఇది!! అంత్యక్రియల్లో నిద్రలేచిన బామ్మ

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ లో తీవ్రత కాస్త ఎక్కువైంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన అందరికి అశ్చర్యాన్ని కలిగిస్తోంది. చనిపోయిందని భావించిన 75 ఏళ్ల బామ్మ పాడి పై ఉన్నప్పుడు నిద్ర లేచింది.

మహారాష్ట్ర బారామతి జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. శకుంతల గైక్వాడ్ ఇటీవల కరోనా బారిన పడింది. అయితే ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇంట్లో వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో శరీరంలో కదలికలు కనిపించలేదట. దీంతో చనిపోయింది అనుకోని అంత్యక్రియలు చేస్తుండగా… ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుందట. దీనితో అందరూ ఒక్కసారిగా భయపడ్డారట. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులు చికిత్సను అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement