Sunday, April 28, 2024

తెలంగాణలో భూకంపం…ఎక్కడో తెలుసా ?

తెలంగాణలో భూకంపం సంభవించింది. నాగర్ కర్నూల్ జిల్లా లోని అచ్చంపేట, ఉప్పునుంతల లో భూమి స్వల్పంగా కంపించిందని అధికారులు గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోల‌జీ కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. ఉదయం 5 గంటలకు భూమి కనిపించడంతో ప్రజలంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.

ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. అయితే దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరగలేదని…అయితే ఇటీవల భారీ వర్షాలు వరదల కారణంగా భూమి పొరల్లో నీరు చేరడం వల్ల భూ ప్రకంపనలు వచ్చి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement