Sunday, May 5, 2024

చేనేత కాలనీలో చోరీ

తాడిపత్రి : తాడిపత్రి పట్టణం, చేనేత కాలనీలో ఓ ఇంట్లో అర్ధరాత్రి దుండగులు చొరబడి ఇంట్లోని రూ.12 తులాల బంగారు, రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన విషయం తెలియగానే పట్టణ సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ ధరణిలు ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. బాధితుడు రాఘవ తెలిపిన సమాచారం మేరకు వివరాళిలా ఉన్నాయి. రాఘవ కూతురుకు అనారోగ్యంగా ఉండటంతో అతని కుటుంబం గత రెండు రోజులుగా.. రాత్రుళ్లు ఆసుపత్రిలో గడుపుతున్నారు. పగలు ఇంటికి వచ్చి వెళ్లేవారు. బాధితుడు ఇంటి యజమాని కావడంతో కింది పోర్షన్ అద్దెకిచ్చి.. పై పోర్షన్ లో తాను తన కుటుంబంతో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి తన కూతురు అనారోగ్య కారణంగా.. రాఘవ తన కుటుంబంతో పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. దీంతో దుండగులు అతని ఇంట్లో చోరీ కి పాల్పడ్డారు. సంఘటన తెలియగానే పట్టణ సిఐ కృష్ణారెడ్డి, ఎస్ఎస్ఐ ధరణి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీమ్ ను కూడా రప్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement