Friday, April 26, 2024

దమ్ముంటే దేశమంతా దళిత బందు అమలు చేయాలి.. దేశంలో గుజరాతీల పాలన

దేశంలో గుజరాతీల పాలన నడుస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశాన్ని అదానీ, అంబానీ ల చేతుల్లో పెట్టిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. బిజెపి దళిత వ్యతిరేక పార్టీ అని, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి దమ్ముంటే భారతదేశమంతా దళిత బంధు అమలు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని దళితులకు బిజెపి అసలు స్వరూపం తెలుసని, ఎట్టి పరిస్థితుల్లో కాషాయ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు దళిత సమాజం సిద్ధంగా లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల పై ఫోకస్ పెడతామని, దళిత ఎమ్మెల్యేలపై అసత్యపు ఆరోపణలు చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదన్నారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీలతో పాటు మీనారిటీ, బీసీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేసి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement