Tuesday, April 30, 2024

మందేద్దామా అంటోన్న కృతిశెట్టి-ది వారియ‌ర్ చిత్రం నుండి ప్రోమో

హీరోయిన్ కృతిశెట్టి ..హీరో రామ్ ని మందేద్దామా అంటూ అడిగిన ప్రోమోని రిలీజ్ చేసింది ది వారియ‌ర్ చిత్ర యూనిట్.
ఎన్‌.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం గురువారం విడుద‌లై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. కానీ క‌లెక్ష‌న్‌ల‌లో మాత్రం జోరు చూపిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం దాదాపు రూ.15 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టింది. ఇదిలా ఉంటే తాజాగా మేక‌ర్స్ ఈ చిత్రం నుండి ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ ప్రోమోలో కృతి ‘బ‌య‌ట‌కు వెళ్దామా’ అని అడగ‌గా.. దానికి రామ్ న‌వ్వుతూ ‘ఎక్క‌డికి కాఫీ షాప్‌కేనా’ అంటారు. అంత‌లో కృతిశెట్టి ‘ఏ అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్‌కేనా.. మందేద్దామా’ అంటుంది. పది సెకన్ల నిడివిగ‌ల ఈ ప్రోమో ఆక‌ట్టుకుంటుంది. వీరిద్ద‌రి మ‌ధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ పోతినేని పోలీస్ అధికారిగా, డాక్ట‌ర్‌గా రెండు పాత్ర‌ల్లో న‌టించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్ర‌తినాయకుడి పాత్ర‌లో న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement