Wednesday, May 15, 2024

ది వారియ‌ర్ డైరెక్ట‌ర్ కి -చెక్ బౌన్స్ కేసులో ఆరేళ్లు జైలు శిక్ష‌

ఇటీవల విడుదలైన ది వారియర్ చిత్రాన్ని తెరకెక్కించారు ద‌ర్శ‌కుడు లింగుస్వామి. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అని తెలిసిందే. కాగా లింగుస్వామికి చెక్‌బౌన్స్ కేసులో చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కొన్ని సంవత్సరాల క్రితం..హీరో కార్తి, సమంత జంటగా ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ పేరుతో ఓ సినిమా తీయాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ సినిమాస్ నుంచి అప్పు తీసుకున్నారు. ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో పీవీపీ సినిమాస్ నుంచి తీసుకున్న సొమ్మును చెక్కు రూపంలో తిరిగి చెల్లించారు. వారిచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణకు రాగా లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్‌లకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. సైదాపేట్ కోర్టు తీర్పుపై లింగుస్వామి సోదరులు అప్పీలుకు వెళ్లనున్నారు. లింగుస్వామి దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాత కూడా. తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్‌పై పలు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ పైనా కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement