Monday, May 6, 2024

జలుబు జ్వరం అనుకుని వస్తే నో మెడిసిన్… తెలంగాణ సర్కార్ ఆదేశాలు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతిరోజు వందల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి జలుబు, జ్వరం గొంతునొప్పి ఇతర ఇబ్బందులతో మెడికల్ షాప్ లకి వస్తే ఏ మందులు ఇవ్వకూడదని ఆదేశాలను జారీ చేసింది.

ఇక పై నో మాస్క్, నో మెడిసిన్ రూల్ అమలుచేయాలని వైద్య శాఖ అధికారులను కూడా ఆదేశించింది. మెడికల్ షాప్ లోకి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఏమాత్రం కనిపించిన ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళేలా సూచించాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement