Tuesday, April 30, 2024

సొంత నిధులతో కాలువపైకప్పు పూర్తి చేస్తా… ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

చేర్యాల: చేర్యాల పట్టణంలోని రజకుల ఆరాధ్య దైవం మడేలయ్య ఆలయ ప్రాంగణంలో ఉన్న మత్తడి కాలువపై పైకప్పు వేసేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన సొంత నిధులు ఏసిఎఫ్ నుండి 20 లక్షల రూపాయల కేటాయించినట్లు తెలిపి అక్కడ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ మడేలయ్య దేవాలయానికి వారం రోజులలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తామని, మున్సిపల్ పాలకవర్గం మడేలయ్య గుడికి సిసి రోడ్ నిర్మాణం కోసం అంచనా వ్యయం వివరాలు తెలిపితే వెంటనే సిసి రోడ్డు కూడా మంజూరు చేస్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.

కొమ్మూరి నిన్ను నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో చీకోట్టారు : ముత్తిరెడ్డి

- Advertisement -

ఆంధ్ర పాలకుల మోకాళ్ళ దగ్గర తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు కొమ్మురు ప్రతాప్ రెడ్డి అని, పూటకో పార్టీ రోజుకో కండువా వేసుకొని తిరిగే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 30 వేల పైచిలుకోటతో గెలిచిన నిన్ను నియోజకవర్గంలో ప్రజలు చీకొట్టి ఓడించారు. అలాంటి నువ్వు నా పైన అసత్య ఆరోపణలు చేసినంతమాత్రాన నిన్ను ప్రజలు ఎవరు నమ్మరని త్వరలోనే ప్రజలు నీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు.

త్వరలోనే నీ అక్రమాలు బయటపెడతా : కౌన్సిలర్ చంటి,ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

చేర్యాల పట్టణంలో దాదాపు 33 ఎకరాల వెంచర్ చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 3 ఎకరాల 30 గుంటల భూమిని కూడా మింగిన ఘనుడు కొమ్మురు ప్రతాపరెడ్డి అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి అన్నారు. ఇప్పుడున్న పెట్రోల్ బంక్ భూమి కూడా చుంచనకోట గ్రామానికి చెందిన వెల్ది లింగయ్య అనే వ్యక్తి నుండి, చేర్యాల పట్టణానికి చెందిన తడక లక్ష్మణ్ అనే వ్యక్తులను బెదిరించి పెట్రోల్ బంక్ నిర్మించిన స్థలాన్ని అక్రమంగా తీసుకున్నారని త్వరలోనే విడతలవారీగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి బాగోతాలను బయటపెడతానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. నా బిడ్డ పట్టా భూమిని చేర్యాల పట్టణ ప్రజల కోసం ఇచ్చింది ఇదే భూమిని గతంలో పట్టణ ప్రజలు మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొనుగోలు చేసి పట్టణ ప్రజలకు ఇవ్వాలని మీ ఇంటికి వచ్చి అడిగితే వారిని నాకేం తీట కొనడానికి అని మీరు అన్న మాట వాస్తవం కాదా అని అన్నారు.

భట్టి విక్రమార్క పాదయాత్రలోనే నిన్ను ఎవరు గుర్తించలేదు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పాదయాత్ర జనగామ నియోజకవర్గంలో జరిగిన సమయంలో భట్టి విక్రమార్క నిన్ను దగ్గరికి కూడా రానీయలేదు, కనీసం నిన్ను గుర్తించలేదు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఇప్పటికైనా తెలుసుకో. పూటకో పార్టీ మారతావు కాబట్టే భట్టి విక్రమార్క నిన్ను దగ్గరికి రానీయలేదు. రేపు నువ్వు ఏ పార్టీ నుండి పోటీ చేస్తావో నీకే తెలియదు అలాంటి నువ్వు నా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందనీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement