Sunday, May 5, 2024

నాన్​వేజ్​ తినేవారి సంఖ్య పెరుగుతోంది.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి

దేశంలో మాంసాహారం భుజియించే వారి సంఖ్య పెరుగుతోంది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్‌, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని జాతీయ కుటు-ంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)-5 వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషుల నుంచి ఈ వివరాలు సేకరించారు. ఆ సర్వే ప్రకారం దేశంలో శాకాహారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. శాకాహార పురుషుల సంఖ్య 21.6 శాతం నుంచి 16.6 శాతానికి పడిపోయింది. అంటే మాంసాహారులు 5 శాతం పెరిగారు. మహిళల్లో మాంసాహారుల సంఖ్య స్వల్పంగా 0.6 శాతమే పెరిగింది. మాంసాహారాన్ని వ్యతిరేకించే గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్ల్రోనూ మాంసాహార ప్రియులు స్వల్పంగా పెరిగారు.

పురుషుల్లో మాంసాహారం తినేవారిలో లక్షద్వీప్‌లో అత్యధికంగా 98.4 శాతం ఉన్నారు. రాజస్తాన్‌లో అత్యల్పంగా 14.1 శాతం ఉన్నారు. లక్షద్వీప్‌ తర్వాత అండమాన్‌ – నికోబార్‌ దీవుల్లో 96.1శాతం, గోవా 93.8 శాతం, కేరళ 90.1శాతం, పుదుచ్చేరి 89.9శాతం మాంసాహారులు ఉన్నారు. ఇక్కడ వారానికోసారి మాంసం తినేవారి నిష్పత్తి కూడా బాగా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement