Friday, May 17, 2024

Delhi | దేశంలో పెరిగిన వరి సాగు విస్తీర్ణం.. గణాంకాలు విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో స్వల్పంగా వరి సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జులై 21 వరకు నమోదైన సాగు విస్తీర్ణం గణాంకాలను కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. గత ఏడాది 175.47 లక్షల హెక్టార్ల నుంచి ఈ ఏడాది 180.20 లక్షల హెక్టార్లకు వరి సాగు పెరిగిందని చెప్పింది. పది లక్షల హెక్టార్ల మేర పప్పుదినుసుల సాగు తగ్గిందని చెప్పింది.

- Advertisement -

గత ఏడాది కంటే శ్రీ అన్న, చిరు ధాన్యాల సాగు పెరిగిందని వ్యవసాయ శాఖ తెలిపింది. 128.75 లక్షల హెక్టార్ల నుంచి 134.91 లక్షల హెక్టార్లకు శ్రీ అన్న, చిరుధాన్యాల సాగు పెరిగిందని, నూనె గింజల సాగులోనూ 5 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం పెరిగిందని పేర్కొంది. మొత్తంమీద దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగిందని వెల్లడించింది. గత ఏడాది 724.99 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరగ్గా, ఈ ఏడాది 733.42 లక్షల హెక్టార్లకు సాగు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement