Sunday, May 5, 2024

Breaking | మాజీ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ కారులో చెల‌రేగిన‌ మంట‌లు.. మూడు కార్లు దగ్ధం

ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మూడు కార్లు దగ్ధమైన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజయ్యకు చెందిన కారు సెంట్రల్ లాక్ చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి.

ఒక్కసారిగా వ్యాపించిన మంటలతో పక్కనే ఉన్న మరో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అక‌స్మాత్తుగా చెలరేగిన మంటల్లో కియా, ఇన్నోవా క్రిష్ట, క్రేట కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement