Monday, April 29, 2024

అవుకు చేరుకున్న ఎమ్మెల్సీ చల్లా మృతదేహం

నంద్యాల జిల్లా అవుకు లోని చల్లా నివాసానికి ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి మృతదేహం చేరుకుంది. దీంతో స్థానికుల‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. తమ నాయకుడిని కడసారి చూసేందుకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు వ‌చ్చారు. ఆయ‌న పార్థీవ దేహానికి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు.
అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రాక..
అనారోగ్యంతో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు చల్లా భగీరథ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మధ్యాహ్నం మూడు గంటలకు అవుకు రానున్నారు. ఈ సందర్భంగా హెలిపాడ్ ను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement