Wednesday, March 27, 2024

కాంతార చిత్రాన్ని వీక్షించిన కేంద్రమంత్రి.. ట్విట్టర్ లో స్పందించిన నిర్మలా సీతారామన్

కాంతార చిత్రాన్ని వీక్షించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో స్పందించారు. బెంగళూరులో చిత్రాన్ని వీక్షించిన కేంద్ర మంత్రి దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. విడుదల వరకు అసలు ఎవరికీ తెలియని ఈ సినిమా.. విడుదల తర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనూహ్య విజయంతో ప్రాంతాలు, భాషలకు అతీతంగా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. రిషబ్‌ శెట్టి నటన, అద్భుత దర్శకత్వంతో ఈ సినిమా విజయతీరాలను అందుకుంది. ఒక్క తెలుగులోనే ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లు రాబట్టింది అంటే కాంతార స్టామినా ఏంటో అర్థం అవుతుంది. కలెక్షన్లకే పరిమితం కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుందీ చిత్రం. యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు కాంతార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు సైతం ఈ సినిమాను వీక్షిస్తూ చిత్ర యూనిట్‌ను ప్రశంసిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement