Monday, April 29, 2024

Delhi | కోదాడ ఎమ్మెల్యేకు చుక్కెదురు.. అసెంబ్లీ ఎన్నికల పిటిషన్‌ తిరస్కరించిన ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అసెంబ్లీ ఎన్నికల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు చుక్కెదురైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మల్లయ్య యాదవ్ తన ఆస్తుల వివరాలు సరిగా చెప్పలేదని మాజీ ఎమ్మెల్యే పద్మావతి కేసు పెట్టారు.

ప్రస్తుతం ఆ కేసు విచారణ హైకోర్టులో సాగుతోంది. హైకోర్టులో తన వివరణ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మల్లయ్య యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టులో ఇంతకాలం ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించింది. “మీ న్యాయవాదితో మాట్లాడి సమాచారం చేరవేయాల్సిన బాధ్యత మీదే”నని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement