Saturday, April 20, 2024

ఉగ్ర‌వాది అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం..

అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పోలీసులు చెక్ పాయింట్ వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా ఉగ్ర‌వాది ప‌ట్టుబ‌డ్డాడు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తీసుకువెళుతుండగా అతడు పట్టుబడ్డాడని పోలీసులు చెప్పారు. దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదిని అరెస్టు చేసి అతని వద్ద ఒక చైనీస్ తుపాకి, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టెర్రరిస్టును కోటి దోడాకు చెందిన ఫరీద్ అహ్మద్‌గా గుర్తించారు. నిందితుడు దోడాలోని పోలీసు సిబ్బందిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యాడని దర్యాప్తులో తేలింది. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement