Friday, May 17, 2024

శ‌క్తి మేర‌కు ప‌ని చేయండి-రాబోయే వంద రోజులు మ‌న‌కు చాలా కీల‌కం-మాణిక్యం ఠాకూర్

గాంధీభ‌వ‌న్ లో మునుగోడు ఉప ఎన్నిక‌పై స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్. 20వ తేదీన మునుగోడు నియోజక వర్గంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు మాణిక్యం ఠాగూర్. గాంధీ కుటుంబాల త్యాగాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. 20వ తేదీన కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి కలవాలని తెలిపారు. మన శక్తి వంతన లేకుండా కృషి చేయాలన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం అవుతుందని… అక్టోబర్ చివరకు తెలంగాణ లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందన్నారు. రాబోయే వంద రోజులు మనకు చాలా కీలకమని.. ప్రతి ఒక్కరు శక్తి మేరకు పని చేయాలన్నారు. మన లక్ష్యం ఒక్కటే.. కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకోవాలన్నారు. మునుగోడు.. మన కాంగ్రెస్ అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్ళి విజయం దిశగా ముందుకు సాగాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement