Thursday, May 2, 2024

స‌మంత‌కు ద‌క్కిన తెలంగాణ అరుదైన అవార్డు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు బిజినెస్‌ వ్యక్తులు, సినీ ప్రముఖులు, ఇతరులకు తెలంగాణ ప్ర‌భుత్వం అవార్డులు బహుకరించింది. హైదరాబాద్‌ లోని… తాజ్ డెక్కన్ లో “ఛాంపియన్ ఆఫ్ చేంజ్ తెలంగాణ” అవార్డులు ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. సామాజిక స్పృహను పెంపొందించే లక్ష్యంతో ఏటా ఈ అవార్డులు ఇస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే… 2021 సామాజిక సేవా విభాగంలో ప‌లువురికి అవార్డులు ద‌క్కాయి. గ్యాస్ట్రోనాలజీస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, పీవీ సింధు, మై హోమ్ రామేశ్వర రావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌, హీరో అల్లు అర్జున్, యాక్టర్ ముఖేష్ రిషి ఈ అవార్డులు అందుకున్నారు. అయితే.. వీరితో పాటు టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత కూడా ఈ అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా సమంత ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement